CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల, ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలని ఏఐసిసి పిలుపుమేరకు శుక్రవారం జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్ లో పెట్రోల్ బంక్ నందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి వీరభద్రం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.  కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలు బయటకు వెళ్లి పనులు చేసుకొని పరిస్థితిలో, పూట గడవని పరిస్థితి లో, ఉన్నారన్నారు, మరి అలాంటి వారిపై పన్నుల రూపంలో అధిక భారం మోపడం సరైనది కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ,ప్రభుత్వాలు పెంచిన ధరలను, పన్నులను, కరెంటు బిల్లులను, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు చిలుకూరి కృష్ణయ్య, మందా బాబు, అచ్చయ్య, బొడ్డు కృష్ణయ్య,చెరుకుమల్లి  నవీన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: