మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మణుగూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కారం. విజయకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనేక పోరాటాలు,త్యాగాలు బలిదానాలతో 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాదించంబడింది అన్నారు. ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగలతో సాధించిన రాష్ట్రం ఉద్యమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో సాగునీరు, తాగునీరు,విద్యుత్తు,విద్య, వైద్యం,రోడ్లు,అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అన్నారు.ఈ సందర్భంగా అమరవీరుల కు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పి.వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీ కణితి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: