మన్యం టీవీ,బూర్గంపాడు:
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీసీ-కాలనీ గేట్ ఎదురుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి. ఈ సందర్భంగా శ్రామిక శక్తి యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు,బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకుందని,ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు అలాగే..
తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ సాగునీరు, తాగునీరు,విద్యుత్తు,విద్య, వైద్యం,రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో సాకారం చేసుకుంటూ వస్తుందని.. భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి,సంక్షేమ రంగాల్లో దేశానికి,సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని అన్నారు.
సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, ఒక్కొక్కటిగా ఓపికతో, దార్శనికతతో అవాంతరాలను లెక్కజేయకుండా సక్కదిద్దుకుంటూ మన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వస్తున్నారని అన్నారు. తెలంగాణ సమాజం.. అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు.
ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి వున్నదన్నారు.
వృద్ధులకు,వికలాంగులకు, మహిళలక,కళాకారులు, కులవృత్తులకు,ఇతర వృత్తులతో పాటు,ఆసరా అందాల్సిన ప్రతిఒక్క వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందన్నారు.ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ,వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉంది అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధిలో సంక్షేమ పథకాలు అమలులో ముందంజలో ఉంటూ ప్రగతి పథంలోదూసుకుపోతున్నందకు గర్వంగా భావిస్తునము అని, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో షేక్ అజీమ్, రామిరెడ్డి,కొండారెడ్డి,గోపాల్,దయాకర్,రమణారెడ్డి,
ఇలియాజ్,మహేష్, రవికుమార్,షఫీ ఖాన్, మహబూబ్ ఖాన్, ఆదినారాయణ,వెంకటరెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: