*నిర్లక్ష్యపు డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం.
తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
జాతీయ రహదారిపై వాహనాలు నిలిపి ప్రమాదాలకు కారణం అయ్యే వాహనం డ్రైవర్లపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. రహదారిపై వాహనాలు నిలువదని నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగినట్లయితే వాహన డ్రైవర్లకు పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా భారీ వాహనం మెకానికల్ డిఫెక్ట్ వల్ల ఆగిపోయినట్లు అయితే తాడ్వాయి పోలీసు వారికి సమాచారం అందించి పోలీసువారి సాయం తీసుకుని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలన్నారు. వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు రోడ్డుపై ముందు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతాయని అనవసరంగా రోడ్డుపై వాహనాలు ఆపకూడదు అని విజ్ఞప్తి చేశారు. ప్రతి వాహనానికి రేడియం స్టిక్కరింగ్ వాహన యజమానులు డ్రైవర్లు చూసుకోవాలని ఆగి ఉన్న దూరం నుండి కనిపిస్తుందన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగి కనిపించిన బ్రేక్ డౌన్ వల్ల ఆగిపోయిన వాహనాలు కనిపించినప్పుడు ప్రయాణికులు అయిన మండల ప్రజలు ఎవరైనా తాడ్వాయి పోలీస్ స్టేషన్(9440795249,9440700575)కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.
Post A Comment: