మంగపేట మండలం తోండ్యాల గ్రామంలో సుమారు అరవై కి పైగా పాజిట్వీవ్ కేసులు ఉండడంతో స్థానికుల సమాచారం మేరకు ఐదు నిరుపేద కుటుంబాలకు కరోనా మెడికల్ కిట్లను మంగపేట సీనియర్ రిపోర్టర్ ఎర్రం స్వామి చేతుల మీదుగా అందించారు.ఈ సంధర్బంగా ఎర్రం స్వామి మాట్లడుతూ సేవాభారతి సభ్యులు కరోనా లాంటి విపత్కర పరిస్తితులలో నిరుపేదలను గుర్తించి,మెడికల్ కిట్లను అందించడం అభినందించ దగ్గ విషయమని,వారి సేవలు విస్తృతం చేయాలని అన్నారు. కరోనా భాదితులను ఉద్దేశించి స్వామి మాట్లడుతూ కరోనా వచ్చిన వారు మానసికంగా దైర్యంగా ఉండాని,ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎర్పడితే స్థానిక ఆశాలను,ఏ ఎన్ ఎం ల సలహాలను పాటించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో
సేవాభారతి
ఖండ ప్రముఖ్ ఇప్పలపెళ్ళి రమేష్ మాట్లడుతూ ఎయిమ్స్ సూచనల ప్రకారం మాత్రలు ఇవ్వబడ్డాయని, కాబట్టి వాడే ముందు స్థానిక ఏ ఎన్ ఎం ని సంప్రదించి వాడాలని , కిట్లో మెడిసిన్ తో పాటు *ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు,ఫల్స్ ఆక్సిమీటర్ డిజిటల్ ధర్మమేటర్ బ్లెసోడిన్ తో పాటు కషాయం పౌడర్* కూడ ఉన్నట్టు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిపెళ్లి మాజీ సర్పంచ్,మాజీ ఎంపీటీసీ జబ్బ సమ్మయ్య తోపాటు సేవాభారతి కార్యకర్తలు బూర నాగేష్,నందిగాం కృష్ణ స్వామి,తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: