మన్యం టీవీ చర్ల: చర్ల మండలం బస్టాండ్ రోడ్డు పై బ్లేడ్ ట్రాక్టర్ ఒక వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే చర్ల మండలం లోని సి ఆర్ కాలనీ లో నివాసం ఉంటున్న చిప్పనపల్లి రాజు బస్టాండ్ సెంటర్ నుండి పశువుల ఆసుపత్రి రోడ్డు వైపు నడుచుకుంటూ వస్తుంటే అటువైపు నుంచి వస్తున్నటువంటి టేకులగూడెం గ్రామానికి చెందిన నూప ఉంగ డ్రైవర్ యొక్క ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది. డ్రైవర్ పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Post A Comment: