ముప్పిడి సర్వోత్తమ రెడ్డి కి ధన్యవాదాలు
తెలిపిన గ్రామస్తులు
గుండాల ( మన్యం టీవీ) కరోనాతో మృతి చెందిన సిపిఎం మండల కార్యదర్శి జోగా నర్సయ్య కుటుంబానికి తుని కాకుల సెట్ ముప్పిడి సర్వోత్తమ రెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని చేశారు. ఈ ఆర్థిక సాయాన్ని ముంత జిమ్ ఖుద్దూస్ తూరు బాకా వెళ్లి జోగా నర్సయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. కరోనాతో మరణించిన జోగా నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని సెట్ సర్వోత్తమ రెడ్డి అన్నారు. జోగా నర్సయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని అన్నారు. ఆర్థిక సాయాన్ని చేసిన సేటు కు ధన్యవాదాలు అని జోగా నర్సయ్య కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు తెలియజేశారు
Post A Comment: