మన్యం టీవీ : ఇల్లందు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని జగ్గుతండ, చర్లపల్లి గ్రామ పంచాయతీలలో కరోనా బాధితులను పరామర్శించేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కరోనా బాధితుల ఇంటి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి మనో ధైర్యం కల్పిస్తూ కూరగాయలు, కోడిగుడ్లు, నిత్య అవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్, ఎంపీపీ చేపూరి మౌనిక, వైస్ ఎంపీపీ తాత గణేష్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గంగుల సత్యనారాయణ, పార్టీ గౌరవ సలహాదారులు ఎస్ కె సోదు మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని రామ్మూర్తి గౌడ్, వీరభద్రం మండల పార్టీ కార్యదర్శి తిరుమల ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీ తిరుమల శైలజరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: