గుండాల /ఆళ్ల పల్లి ( మన్యం టీవీ) రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి ముఢిగె నాగేశ్వరరావు మృతి చెందాడు. ఆళ్ల పల్లి మండలం పరిధిలోని చింతొని గుంపు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఇల్లందు నుండి స్వగ్రామానికి కారులో వస్తున్న క్రమంలో భారీగా వర్షం కురుస్తుండటంతో బొంబాయి తండా మూలమలుపు వద్ద అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది గాయపడిన నాగేశ్వరరావును హైదరాబాద్ తీసుకువెళ్లి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. చికిత్స పొందుతూ శనివారం మృత్యువాత పడ్డాడు
Navigation
Post A Comment: