మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ములుగు మండలం లోని పందికుంట గ్రామపంచాయతీ భూపాలపల్లి నగర్ లో ములుగు మండల పరిషత్ ఉపాధ్యక్షులు విజయ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లా తెరాస సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారికి నిత్యవసర వస్తువులు బియ్యం కోడిగుడ్లు కూరగాయలు అందజేశారు అనంతరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి లాక్ డౌన్ సమయంలో మృతి చెందిన చిలకల ఓదేలు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేశారు అదేవిధంగా లావణ్య రెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తెరాస కార్యకర్త కు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నక్క కుమారస్వామి,నాగిడి రమణరెడ్డి, కొమర రెడ్డి, ఆయిలి మల్లు, పెదస బోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: