మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల పరిధిలోని ఏటూరునాగారం నుండి భూర్గంపహాడ్ వెళ్లే రహదారి పై మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా ఆధ్వర్యంలో మంగళవారం వాహనాలతనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొత్త మల్లూరు, చుంచుపల్లి, వాడగూడెం, రాజుపేట గ్రామాల వద్ద రహదారిపై వాహనాలను ఆపి తనిఖీలను ముమ్మరంగా చేపట్టి వాహనాదరులవద్ద పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈసందర్బంగా తెలియజేసారు. హెల్మెట్ తో పాటు విధిగా లైసెన్స్ తదితర సంబందించిన ధ్రువీకరణ పత్రాలు కూడా కలిగి ఉండాలని ఈ సందర్బంగా తెలియజేసారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈసందర్బంగా పేర్కొన్నారు.
Post A Comment: