బాధితులను బయటకి తీసి,పోలీస్ వాహనంలో హాస్పిటల్ కు తరలించిన ఎస్ ఐ నరేష్
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామనుజవరం గ్రామ సమీపంలో మంగళవారం బోగ్గు టిప్పర్ ను వెనుక నుంచి ఇటుక లోడుతో వెల్లుతున్నా ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది.వ్యాన్ లో ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తులను స్వయంగా ఎస్.ఐ.నరేష్,స్థానికుల సహాయంతో బయటకు తీశారు.ఎస్ ఐ నరేష్ ఆదేశాల మేరకు బాధితులను పోలీసు వాహనంలో సిబ్బంది హాస్పిటల్ కు తరించారు. స్వయంగా ఎస్.ఐ నరేష్ మరియు సిబ్బంది క్యాబిన్ లో ఇరుక్కున్న వారిని బయటకు తీసి తన వాహనంలో హాస్పిటల్ కు పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎస్.ఐ నరేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: