మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్ లోని చర్చి కాంప్లెక్స్ సముదాయంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించామన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు ప్రజలు ఏ సమస్యలు ఉన్నా నిర్భయంగా క్యాంపు కార్యాలయానికి వచ్చి మా దృష్టికి తీసుకురావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించడమే మా లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకట రెడ్డి, ఎంపీపీ లావుడ్యా సోని, బొర్ర రాజశేఖర్, ఎంపీటీసీలు దుద్దుకూరు మధుసూదన్ రావు, పెండ్యాల రాజశేఖర్, సర్పంచులు కిషన్ లాల్, రాందాసు, తెలంగాణ ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు, నాగరాజు, వెంకట నర్సయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: