CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉన్నతాధికారుల తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా

Share it:

 


👉 ప్రభుత్వ పనులకు ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవు

👉 గ్రామసభల ఆమోదం తర్వాతనే చెక్కుల పంపిణీ చేయాలి: రైల్వే లైన్ భూనిర్వాసితులు

మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రామనుజవరం గ్రామ రైల్వే లైన్ భూనిర్వాసితులు ఆందోళనలు నిర్వహించారు. వెంటనే స్పందించి సిఐ భాను ప్రకాష్.ఎస్ ఐ పురుషోత్తం,సిబ్బంది తో తహసీల్దార్ కార్యాలయంకి చేరుకొని పరిస్థితి ని అదుపు చేశారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి. వెంకటేశ్వర్లు,తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రైతులతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్యాకేజి విషయంలో మాకు న్యాయం చేయాలని కోరారు.ఉన్న ఎకరం,అర ఎకరం భూమిలో కూరగాయలు,నిత్యావసరాలు పండించుకొని జీవనం కొనసాగితున్నాము అని,మేము కోల్పోయేది భూమి మాత్రమే కాదని, జీవధారం కోల్పోతున్నాము అని రైతులు వారి బాధలను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కి వివరించారు. స్పందించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారుల తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తాము అన్నారు.రైల్వే లైన్ భునిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసి,స్థానిక కాంట్రాక్టు ఉద్యోగాలు, పనులు వారికే వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.భునిర్వాసిత రైతులు గ్రామంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్ర శేఖర్,సిఐ భాను ప్రకాష్,ఎస్ ఐ పురుషోత్తం,రైతులు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: