మన్యం మనుగడ,పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడేళ్ల బయ్యారం శ్రీరామ్ బృహస్పతి ఓ దిన పత్రిక విలేఖరి వ్యాక్సిన్ వేసుకున్న కోవిడ్ బారిన పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరామ్ బృహస్పతి తన మామగారు కరోనా బారిన పడడంతో హన్మకొండలోని ఓ వైద్యశాలలో వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించడానికి బృహస్పతి శుక్రవారం వెళ్లడం జరిగింది. మాస్కు ధరించి మామగారికి సేవలందించారు.ఐనప్పటికీ శనివారం ఉదయం బృహస్పతి తలనొప్పితో బాధపడుతూ పినపాక ప్రాథమిక కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. శ్రీరామ్ బృహస్పతి కోవాగ్జిన్ రెండు డోసులు వేసుకొని ఉన్న కరోనా బారిన పడడం గమనార్హం. వ్యాక్సిన్ వేసుకున్న కరోనా నిబంధనలు పాటించకుంటే కరోనా బారిన పడడం ఖాయమని సంకేతాలు శ్రీరాం బృహస్పతి ఉదాహరణ.
Post A Comment: