మన్యం టీవీ కొత్తగూడెం:-
జూన్ 26 శనివారం నాడు
మణుగూరు లోస్ ఏరియా కమిటీ సభ్యుడు మడివి
ఇడుమ ఎలియాస్,సురేందర్ 23 సంవత్సరాలు మరియు దళ సభ్యురాలు మడకం బుద్రి ఎలియాస్, సోనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పోలీసు వారి ఎదుట లొంగిపోయినారు.
మడివి ఇడుమ ఎలియాస్, సురేందర్ నిషేధిత సిపిఐ పార్టీలో ముఖ్య పాత్ర పోషించాడు. ప్రస్తుతం
ఇడుమ మావోయిస్ట్ పార్టీ స్టేట్ కమిటీ మెంబెర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్ సెక్రటరీ ఆజాద్
నకు గార్డ్ గా పనిచేశాడు.2018 వ సంవత్సరం నుండి ఇతను మావోయిస్ట్ పార్టీలో పని చేయుచున్నాడు.
మడకం బుధి ఎలియాస్,సోనీ మణుగూరు లోస్ భ్యురాలు కూడా ఆజాద్ నకు గార్డ్ గా పని చేసినారు.2016
వ సంవత్సరం నుండి ఈమె నిషేధిత మావోయిస్ట్ పార్టీ నందు పని చేస్తున్నది.గత నెలలో మడివి
ఇడుమ ఎలియాస్, సురేందర్ ను వివాహమాడినది. వీరిరువురు మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వం వేధింపులకు
మరియు మావోయిస్ట్ పార్టీలోని నాయకులకు,సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో భయపడినారు.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు హరిభూషన్, టెక్ టీం ఇంచార్జ్ సోబ్రాయి,గంగు,
ప్రకాష్,భారతక్క లు కరోనా వైరస్ సోకి మరణించడంతో మావోయిస్ట్ పార్టీలోని నాయకులు మరియు
సభ్యులకు భయం ఏర్పడింది. మావోయిస్టు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యులు మరియు ఇతర సీనియర్
నాయకులు క్రింది స్థాయి నాయకులు మరియు సభ్యులపై సానుభూతి లేకపోవడం, వారి పట్ల నిర్లక్ష్యంగా
వ్యవహరించి,మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడాన్ని మావోయిస్ట్ పార్టీ సభ్యులు గ్రహించారు.
మావోయిస్ట్ పార్టీ నాయకులు మరియు సభ్యులు పోలీసువారి ఎదుట లొంగిపోవాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాము.లొంగిపోయిన వారికి మేము మెరుగైన వైద్య చికిత్సను అందజేస్తామని హామీ
ఇస్తున్నాము.అదే విధంగా ప్రభుత్వం ద్వారా వారికి పునరావాసం కల్పించి, వారికి అందవలసిన ప్రతిఫలాలను
కూడా అందేలా చూస్తాము అని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తెలియజేశారు.
Post A Comment: