మన్యం టీవీ కొత్తగూడెం:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్ లో శనివారం నాడు జరిగిన దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బందెల నరసయ్య ఉప అధ్యక్షురాలు రత్నకుమారి మాట్లాడుతూ
దళిత మహిళ మరియమ్మ నీ ఆమె కూతుర్ని బహిరంగంగా నడి ఊరిలో మగ పోలీసు వారే కొట్టి అది సరిపోక లాకప్లో కొట్టి ఆమె లాకప్ డెత్ కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి ఫ్రెండ్లీ పోలీస్ గా పిలవబడే కొంతమంది పోలీసువారి వలన ఆ వ్యవస్థకి చెడ్డ పేరు మాయని మచ్చగా నిలుస్తున్నారు పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, సస్పెండ్ చేయడం కాకుండా చట్ట పరమైన ఎస్సీ. ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని జైలుకు పంపించాలని లేని పక్షంలో ఈ నిరసనలు ఇలాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు,
ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలకు ప్రభుత్వం ఇస్తామన్న డబ్బు తో పాటు ఉదయ్ కిరణ్ కు, ఉద్యోగం. ఇల్లు సౌకర్యం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అలాగే ఉదయ్ కిరణ్ అతి దారుణంగా మర్మ అవయవాల పై నడుము పిరుదుల పై కొట్టిన దెబ్బలకు కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా పూర్తిగా తగ్గేంతవరకు ముందస్తుగా మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పిట్టల రామచంద్రన్,నిర్మల, విజయలక్ష్మి, పాల్గొనడం జరిగింది
Post A Comment: