మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలంలోని బోటి గూడెం పంచాయతీ పరిధిలో గురువారం 12 గ్రామాలలో సింగిల్ పేస్ విద్యుత్ సప్లై త్రీఫేస్ సప్లై గా ఎస్.ఈ. సురేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పన్నెండు గ్రామాల్లో త్రీ ఫేస్ విద్యుత్ సమస్య ఉండేదని ఆ సమస్య ఇప్పుడు తీరింది అన్నారు. రైతుల సమక్షంలో త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు అడిషనల్ ఇంజనీర్ జీవన్ కుమార్, పినపాక మండల విద్యుత్ శాఖ ఏ. ఈ రవీందర్, అసిస్టెంట్ ఇంజనీర్ మణిదీప్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకన్న, జూనియర్ లైన్మెన్ గోపి, స్థానిక సర్పంచ్ సోంబోయిన సుధాకర్,
స్థానిక రైతులు పాల్గొన్నారు.
Post A Comment: