గుండాల ( మన్యం టీవీ) కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గుండాల సి ఐ శ్రీనివాస్. మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఐసోలేషన్ కేంద్రంలో మొత్తం పదిమంది చికిత్సను తీసుకుంటున్నారు వీరికి ప్రతిరోజు కొంతమంది భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అందులో భాగంగా గురువారం సీఐ శ్రీనివాస్ తన వంతు సాయంగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మందుల ని క్రమం తప్పకుండా వాడాలి అన్నారు. కరోనా నిర్ధారణ అయిన తర్వాత ఇంట్లో కంటే ఐసోలేషన్ కేంద్రంలో ఉండటం వలన వారు మరొకరికి ఈ వ్యాధిని మరొకరికి అంట కుంట వాళ్లు సహాయం చేసిన వాళ్ళు అవుతారన్నారు. ఐసోలేషన్ కేంద్రంలో ఆక్సిజన్ సదుపాయం కూడా ఉన్నందున ఇక్కడ ఉండటం ద్వారా మెరుగైన చికిత్సను తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఆందోళన చెందకుండా సరైన సమయంలో వైద్యం తీసుకుంటే కరోనా ని జయించవచ్చు అన్నారు
Post A Comment: