*ప్రైవేట్ టీచర్స్ కు ఇచ్చే ఆర్ధిక సహాయాన్ని 2000 నుండి 5000 వేలకు పెంచాలి*
మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ కు ప్రకటించిన ఆర్ధిక సహాయం రెండూవేల నగదు ఇంతవరకు రాలేదు. ఈ నెల 25 కిలోల బియ్యం అందించారు ఆర్ధిక సహాయం మరిచారు. పాఠశాలలు లేక గత సంవత్సరం నుండి ప్రైవేట్ బోధన బోధనేతర సిబ్బంది పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు ప్రైవేట్ యాజమాన్యం పట్టించుకోని పరిస్థితి.ఆన్లైన్ క్లాస్ లు మొదలైన కూడా ఎక్కువ బ్రాంచ్ లు ఉన్న స్కూల్స్ ఏదో ఒక బ్రాంచ్ నుండి ఆన్లైన్ క్లాస్ లు చెప్పించటం వలన మిగతా బ్రాంచ్ ల టీచర్స్ అందరూ ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి.ఆన్లైన్ క్లాసులు అందరికి లభించవు.ఇటువంటి తరుణంలో పోషణ ఆర్ధిక భారంగా మారుతుంది. ఇప్పటి కొన్ని స్కూల్స్ యాజమాన్యం పాఠాలు చెప్పించుకొని శాలరీలు ఇవ్వకుండా జరుపులు పెడుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ టీచర్స్ కు ఇచ్చే ఆర్ధిక సహాయం 2000 నుండి 5000 లకు పెంచి సహాయాన్ని అందిస్తే ఎన్నో లక్షల కుటుంబాల ఆర్ధిక పోషణకు ఉపయోగపడుతుంది.అందువలన ఆర్ధిక సహాయాన్ని తక్షణమే అందించాలని ప్రైవేట్ భోధన బోధనేతర సిబ్బంది కోరుతున్నారు.
Post A Comment: