గ్రామస్థాయిలో బాలల సమస్యలను గుర్తించడంలో అంగన్వాడి టీచర్ కీలకపాత్ర పోషించాలి.
జె. ఓంకార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి
మన్యం టీవీ వెంకటాపురం.
ఐసీడీఎస్ సూపరవైజర్ జి.రమాదేవి, రత్నకుమారి ల అధ్యక్షతన జరిగిన ఆలుబాక, వెంకటాపురం సెక్టార్ సమావేశాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారి హాజరై మాట్లాడుతూ...
గ్రామంలో కిశోర బాలలకు వారి హక్కుల గురించి, చట్టాలపై అవగాహన కల్పిస్తూ, గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీ ద్వారా బాలల పరిరక్షణ విభాగానికి (డి సి పి యూ) తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని,
బాలల పరిరక్షణ కమిటీల ద్వారా ప్రతి గ్రామాన్ని బాలల స్నేహపూర్వక గ్రామంగా తీర్చిదిద్దాలి అని, బాలల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులలో పిల్లల చుట్టూ అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
తల్లిదండ్రులు పనికి వెళ్ళిన క్రమంలో పిల్లలు ఒంటరిగా ఉండటం, ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండటం స్నేహం, ప్రేమ పేరుతో పిల్లలను మోసం చేయడం. ఇలా అనేక రకాల కారణాలతో పిల్లలు దోపిడికి గురి అవుతున్నారు.
పిల్లలకు మంచి - చెడు అనే విషయాలపైన అవగాహన లేక పిల్లలు తప్పు దారి పడుతున్నారని పేర్కొన్నారు.
అందుకోసం గ్రామాల్లో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీల ద్వారా పిల్లల సమస్యలను గుర్తించి, గ్రామ స్థాయిలోనే పిల్లల సమస్యలకు పరిష్కార మార్గం చూపించగలరు.
బాల్య వివాహాలు, బాలకార్మికులు, బాలాలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా లేకుండా చూడాలని,
గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని వివరించారు.
గ్రామంలో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. •
గ్రామంలో బాలలకు కొత్తగా వచ్చే ఇబ్బందులు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాలి. గ్రామంలోని బాలల బృందాల సభ్యులు గుర్తించిన సమస్యలను తెలుసుకుని వాటిపై చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మరియు కోవిడ్ వచ్చి బాధపడుతున్న పిల్లలకు హెల్ప్ లైన్ నెంబర్ 040- 23733665 ద్వారా సహాయం అందుతుంది.
ఈ కార్యక్రమంలో ఆలుబాక, వెంకటాపురం సెక్టార్ ల అంగన్వాడీ టీచర్లు సుమారు 60 మంది పాల్గొన్నారు.
Post A Comment: