CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుధాన్యాలతో పోషకాలు

Share it:

 


 జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు


 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 చిరుధాన్యాలు చూడడానికి చిన్నవిగా ఉంటాయి, పోషకాహార విషయంలో మనం రోజూ తినే బియ్యం కన్నా అనేక రెట్ల ఎక్కువ బలం కలిగి ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అభిమన్యుడు పేర్కొన్నారు. శనివారం మండలంలోని పండు వారి గూడెం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ, వాసన్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు పండించటానికి అవగాహన సదస్సు, కంది విత్తనాలు మినీ ప్యాకెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఏఓ మాట్లాడుతూ చిరుధాన్యాలు శరీర అవసరాలకు తగిన శక్తిని అందిస్తాయని అన్నారు. పీచు పదార్థాలు కాల్షియం, ఇనుము, మెగ్నీషియం విటమిన్లు వీటిలో ఎక్కువగా ఉంటాయన్నారు. చిరుధాన్యాలు ఉండే పోషకాలు అవి మనకు చేస్తే లాభాలు చాలా ఉన్నాయని వివరించారు. తాతల ఆరోగ్య రహస్యం చిరుధాన్యాలు వాడకం మనీ కరోనా కాలంలో ఆరోగ్యవంతంగా ఉండాలంటే చిరు ఆహారం తీసుకోవాలని సూచించారు. రానున్న కాలంలో అంగన్ వాడి కేంద్రాలు పిల్లలు కూడా ఈ ఆహారం అందించే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అనంతరం పండు వారిగూడెం లో ని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కంది విత్తనాలు ప్యాకెట్లు పంపిణీ చేశారు. నారాయణపురం రైతు  సమన్వయ సమితి అధ్యక్షులు చిన్నంశెట్టి వెంకట నరసింహం, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తిలు  అభిమన్యుడు, దారా ప్రసాదు లకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ నారం రాజశేఖర్, అశ్వరావుపేట ఏ డి ఏ అఫ్జల్ బేగం, టెక్నికల్ ఏ డి ఏ లాల్ చంద్, ఏవో లు నవీన్, చటర్జీ, దీపక్, ఆనంద్ షాకీరా భాను, సూరిబాబు మరియు గిరిజన రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: