మన్యం టీవీ,బూర్గంపాడు:
మండల కేంద్రమైన బూర్గంపాడు,సారపాక లోని ఫెర్టిలైజర్ షాపులను ఎస్ఐ జితేందర్ తమ సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా షాపులోని రికార్డులను పరిశీలించారు. ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులు కొనుగోలు చేసిన విధానాలకు సంబంధించి రసీదులు పొందాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా రైతుల వద్దకు వచ్చి విత్తనాలు ఇస్తాం అని చెప్పినట్లయితే అట్టి విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని సరైన టాకింగ్ లేబుల్ లేకుండా లూస్ గా ఉంటే వాటిని కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ తనిఖీలో అదనపు ఎస్ఐ కాజా నసీరుద్దీన్, ఏఈవో వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
Post A Comment: