*పొరిక గోవిందా నాయక్ తెరాస పార్టీ జిల్లా సీనియర్ నాయకులు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట రామప్ప దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యువజన సర్వీసుల సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కాకతీయ వెయిటేజ్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ శంకర్రెడ్డి ములుగు జిల్లా ప్రజల తరఫున ములుగు జిల్లా సీనియర్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు జిల్లా అభివృద్ధి కొరకు కృతనిశ్చయంతో ఉన్నారని కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని మెమోరాండం సమర్పించడం ములుగు జిల్లా ప్రజలకు శుభవార్త అని పోరిక గోవిందా నాయక్ అన్నారు.
Post A Comment: