మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తో గూడెం గ్రామానికి చెందిన జిమ్మడి నరసింహారావు పూరిగుడిసె వర్షాల మూలంగా నేలమట్టమైంది. సర్వం కోల్పోయిన వారికి మేము అండగా ఉన్నా మంటూ తో గూడెం ఎంపీటీసీ డాక్టర్ చింతపంటి సత్యం రూ .2500 ,టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల బాధ్యులు డాక్టర్ శ్రీ రామ్ 2000 ఆర్థిక వితరణ ను సోమవారం బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వం చాటుకున్నారు.తోగూడెం సర్పంచ్ కల్తీ శ్రీలత, టీఆరెస్ నాయకులు కల్తీ లక్ష్మయ్య, సతీష్ చారి, రాంటెంకి నరసింహారావు,లక్ష్మయ్య తదితరులు పాల్గోన్నారు.
✍️ నిత్యావసర సరుకులు అందజేసినపినపాక మండల కాంగ్రెస్ పార్టీ
🔥 ఇల్లు కూలి సర్వం కోల్పోయిన నరసింహారావు కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం నిత్యావసర సరుకులు అందజేశారు.
Post A Comment: