💥సహాయ కార్యదర్శి గా సంఘం నాగరాజు,( మన్యం టీవీ)
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చనుమోలు వెంకన్న ఆధ్వర్యంలో ఆదివారం సాయి ఎక్స్లెంట్ స్కూల్ లో జరిగిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ను పూర్తి స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది. గత ఆదివారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా చనుమోలు వెంకన్న, (సూర్యా) కార్యదర్శిగా కొల్లిపాక చంద్రశేఖర్, (ఆంధ్రభూమి) ఉపాధ్యక్షులుగా తంబర్ల పుల్లారావు, (ఐ న్యూస్) గౌరవ సలహాదారులుగా మోదుగు ప్రభాకర్, (ఆంధ్రప్రభ) ఎన్నిక కాగా, 27-06-2021 ఆదివారం కోశాధికారిగా సిహెచ్ నర్సింహారావు, (మనం) సహాయ కార్యదర్శులు గా సంఘం నాగరాజు,( మన్యం టీవీ) షేక్ సిద్దిక్, (టీవీ 35) ప్రచార కార్యదర్శి గా షేక్ షఫీ, (ప్రజా ప్రశ్న) గౌరవ సలహాదారులుగా షేక్ బూడెన్ పషా, (V3 న్యూస్) నల్లగట్ల దిలీప్, (భారత్ టుడే) లను పాలక సభ్యులను హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దీంతో మండలంలో పూర్తి స్థాయిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
Post A Comment: