మన్యంటీవీ,అశ్వారావుపేట:మండలం పెరాయిగుడెం గ్రామ పరిధిలో గల గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని అన్ని వసతులతో కూడిన ఐసోలేషన్ కేంద్రంగా మారుస్తున్నట్లు వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాంబాబు గురువారం తెలిపారు. హోం ఐసొలేషన్ లో ఉండటానికి ఇబ్బందిగా ఉన్న వాళ్లు గ్రామ కోవిడ్ కమిటీ ఆమోదంతో రావాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చి విచ్చల విడిగా బయట తిరిగే వారిని బలవంతంగా ఐసోలేషన్ సెంటర్ లో ఉంచుతమన్నారు.
Post A Comment: