మన్యం టీవీ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో
ఈ రోజు కురిసిన వర్షం తో పిడుగు పాటుకు గురై శ్రీరంగపురం ( చొప్పల పంచాయతీ )కి చెందినమూడు పశువులు మృతి చెందాయి.బాధిత రైతులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోప్పాలా పంచాయతీ శ్రీరంగాపురం గ్రామానికి చెందిన
గోప సమ్మక్క ,ఎట్టి చిన్నమల్లయ్య , గాందార్ల నరసింహారావులకు చెందిన పశువులు ముత్తరం అడవిలోకి మేతకు వెళ్లి.. పిడుగుపాటుకు గురై మృతి చెందాయి.వీటి విలువ సుమారు రూ.80వేలు ఉంటుంది.ఆధారం కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బాధిత రైతులను చొప్పాలసర్పంచ్ జివ్వాజి రాధ,ఉపసర్పంచ్ బోడ ప్రశాంత్ లు విమర్శించారు. ప్రభుత్వం తరపున రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వారన్నారు.
Post A Comment: