CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

పెంచిన పెట్రోల్ డీజల్ ధరలు తగ్గించాలని రాజుపేట గ్రామం లోని పెట్రోల్ బంక్ నందు ( టి ఏ జి ఎస్ )( ఎస్ఎఫ్ఐ )ఆధ్వర్యంలో నిరసన తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా ( టి ఎ జి ఎస్) తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కొమరం సందీప్ కుమార్ మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు దేశ ప్రజల పై పెను భారంగా వున్నాయని దీని మూలంగా నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయని అన్నారు, అదే విధంగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన మనదేశంలో  చమురు ధరలు గ్యాస్ ధరలు పెరుగు తున్నయని పక్క దేశాలలో నలుబది రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తుంటే మన కాడ మాత్రం వంద దాటిందని ఈ ప్రభుత్వం అంబానీ అధాని పెట్టుబడి దార్ల కోసం పని చేస్తుందని పేద ప్రజల కోసం కాదని అన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలువెంటనే తగ్గించ కుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.ఈకార్యక్రమంలో (టీ,ఏ, జి, ఎస్,)

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొమరం సందీప్ కుమార్(ఎస్ఎఫ్ఐ )

జిల్లా అధ్యక్షుడు తోకల రవి

,కృష్ణ ,పవన్ ,మున్న, చంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: