వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
గుండాల ఆళ్ల పల్లి జూన్ 29 ( మన్యం టీవీ) తీరు మారదు నీరు ఆగదు అన్న సందర్భంగా మిషన్ భగీరథ పథకం సాగుతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పథకం అబాసుపాలు ప్రతిసారి అవుతూనే వస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడంతో పరిశుభ్రమైన నీళ్లు వృధాగా పోతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ కొరవడడం వలనే ఇలా జరుగుతుందని మండల వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్ల పల్లి మండల కేంద్రంలో మంగళవారం మిషన్ భగీరథ పైపులైన్ లీక్ అయి పరిశుభ్రమైన నీళ్లు గంటల తరబడి వృధాగా పోతు దర్శనమిచ్చింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలకు నిరంతరం మంచి నీటిని సరఫరా చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు
Post A Comment: