మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ వ్యవసాయానికి , రైతాంగానికి మద్దతునిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు నుండి రాష్ట్రంలోని 63.25 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.7509 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి పథకాన్ని వరసగా ఏడోసారి, కరోన క్లిష్టపరిస్థితులలో కూడా రైతాంగాన్ని విస్మరించకుండా మూడోసారి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు అశ్వాపురం రైతు వేదిక ముందు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఎంపీపీ ముత్తినేని సుజాత.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎంపీటీసీ ఎనిక రవి,మాజీ ఎంపీపీ ఊసా అనిల్ కుమార్,మిట్టగూడెం మాజీ సర్పంచ్ కోర్స దుర్గారావ్,నాయకులు పగడాల రామిరెడ్డి,వెల్పుల వెంకన్న,మామిళ్ల ఖణీష్,గుర్రాల రమేష్ తదితరుల పాల్గొన్నారు.
Post A Comment: