CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే మెచ్చా ఆదేశాలతో కెమిలైడ్స్ వారి సౌజన్యంతో ఎంపీపీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే  మెచ్చా  నాగేశ్వరరావు ఆదేశానుసారం కేమిలైడ్స్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి ఆధ్వర్యంలో అశ్వరావుపేట, పేరాయి గూడెం  మరియు సున్నంబట్టి ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లో ఉన్న మరియు  కరోనా వచ్చీ హోం ఐసోలేషన్ లో వుంటున్న వారికి అలాగే పంచాయతి లోని పారిశుధ్య కార్మికులకు, నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల  ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం  సుమారు 300 కుటుంబాల కు  నిత్యవసర సరుకులు పంపిణీ చేయటం జరిగిందని. ఇంకా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వున్నా కరోనా పేసేంట్లకు, అలాగే ఆశ వర్కర్లకు కుడా ఈ ఒక్క నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ  కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహా యజ్ఞం ల జరిపించడం జరుగుతుందని అయన తెలిపారు. అలాగే కరోనా వచ్చి హోంమ్ క్వారంటైన్ మరియు ఐసోలేషన్ లో ఉన్న వారిని ఎమ్మెల్యే మెచ్చా  ఫోన్లో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జెడ్పీటీసీ చిన్నంసెట్టీ వరలక్ష్మి, ఏంఆర్ఓ చల్లా ప్రసాద్, వైస్ ఎంపీపీ చిట్టురి ఫణీంద్ర, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం రమ్య, పేరాయి గూడెం సర్పంచ్ నార్ల పాటి సుమతి, తెరాస పార్టీ మండల ప్రెసిడెంట్ బండి పుల్లారావు, కార్యదర్శి బండారు శ్రీను, ఉప సర్పంచ్ కేదార్ నాథ్, నార్లపాటి జగన్నాధం, నారాయణ పురం రైతు కమిటీ మెంబర్ చిన్నంశెట్టీ  లక్ష్మి నరసింహం, ఎంపీటీసీ మారుతి లలితా, సెక్రెటరీ లు హరికృష్ణ, శ్రీరామమూర్తి, రమేష్ అలాగే నియోజక వర్గ నాయకులు మెచ్చా రాము, మేచ్ఛా రఘు, శెట్టి పల్లి రఘురామ్, సోమని శ్రీను, పార్టి ముఖ్యనాయకులు మోహన్ రెడ్డి ,వార్డు మెంబర్ శ్రీను, నార్లపాటీ సుదర్శన్, అలాగే తెరాస పార్టీ మండల నాయకులు మరియు గ్రామ పంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: