మన్యం మనుగడ,పినపాక :
గ్రామాల్లో వైకుంఠధామం పనులు వెంటనే పూర్తి చేయాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.
శుక్రవారం మండల పరిధిలోని తోగ్గూడెం, పినపాక గ్రామ పంచాయితీలలో పర్యటించారు. ఈ సందర్భంగా తోగ్గూడెంలో వైకుంఠధామం పనులు పెండింగ్లో ఉన్నాయని, అదేవిధంగా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. అనంతరం పినపాకలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, నర్సరీలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,
పీఏసీఎస్ అధ్యక్షుడు రవివర్మ,
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ముఖ్య నాయకులు బొలిశెట్టి నర్సింహారావు, దాట్ల వాసుబాబు, కామేశ్వరరావు, ఎంపీటీసీ చింతపంటి సత్యం, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: