మణుగూరు వ్యవసాయ సంచాలకులు- తాతారావు
మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం లోని ఎరువులు పురుగు మందుల దుకాణాలను మణుగూరు డివిజనల్ వ్యవసాయ సంచాలకులు తాతారావు శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని పలు పురుగు మందుల దుకాణాలను పరిశీలించి, రైతులకు మంచి దిగుబడి నిచ్చే విత్తనాలను అందజేయాలని, కల్తీ విత్తనాలను అందజేసి మోసగాళ్లు కావద్దని హెచ్చరించారు. నిషేధిత పురుగు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పురుగు మందుల షాపులను సీజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. విత్తనాలు, పురుగు మందులు తీసుకున్న ప్రతి రైతుకు బిల్లులను అందజేయాలని, ప్రతి దుకాణం ముందు ధరల పట్టిక, లభించే మందు లకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణరావు, రమేష్ , కేశవరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: