CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం:-

విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం కొత్తగూడెం వన్ టౌన్ సీఐ రాజు తన సిబ్బందితో కలిసి ఏ పవర్ హౌస్ బస్తీ నందు రాపిల్లి నరేష్ అనే వ్యక్తికి చెందిన ఆర్.ఆర్. పాన్ షాప్ నందు 75,100/-రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తూ పట్టుబడిన నరేష్ ను విచారించగా గొల్లగూడెం నకు చెందిన తాటిపల్లి వీరన్న అనే వ్యక్తి ఇట్టి గుట్కా ప్యాకెట్లను అతనికి సరఫరా చేసినట్లు తేలిందని సిఐ రాజు తెలియజేశారు.నిషేధిత గుట్కాలను సరఫరా చేస్తున్న వీరన్నను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.వీరిరువురిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా వన్టౌన్ సిఐ రాజు మాట్లాడుతూ నిషేధిత గుట్కాలకు అలవాటు పడి కొంతమంది యువత కాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారని తెలియజేసారు.ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇట్టి నిషేధిత గుట్కాలను విక్రయించే వారిపై చట్టప్రకారం కేసులు నమోదుచేసి,కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: