CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి లో అందరూ భాగస్వాములు కావాలి

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గారి ఆధ్వర్యంలో స్థాయి సమీక్ష సమావేశం ఈ సందర్భంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని స్పెషలాఫీసర్ మనోహర్ దిశానిర్దేశం చేశారు. పినపాక మండలంలో పారిశుద్ధ్య కార్యక్రమం, ఏడవ విడత హరితహారం లో భాగంగా గ్రామపంచాయతీలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి లు కార్యక్రమం విజయవంతం కావడానికి తగిన విధంగా కృషి చేయాలని కోరారు. పంచాయతీ సెక్రటరీలు ఉదయం 6 గంటలకే వారి వారి పంచాయతీ కార్యాలయాలకు హాజరుకావాలని, పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. ఎటువంటి అలసత్వం వహించిన సహించేది లేదని,తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూహరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా అందరము కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, తాసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్ ఎంపీవో సునీల్ శర్మ,వివిధ పంచాయతీల సర్పంచులు కార్యదర్శులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: