మన్యం టీవీ : ఇల్లందు
ప్రపంచ దేశాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్ నిర్మించేందుకు ధైర్యం గా ఉంటేనే సాధ్యమవుతుందని ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇల్లందు మండల పరిధిలోని ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ లోని అన్ని గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ వచ్చినవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం కరోనా బాధితులకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ చాట్ల భాగ్యమ్మ, ఎంపీటీసీ పూనెం లింగమ్మ, ఉప సర్పంచ్ శేషగిరి, ప్రజా ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శి మల్లేష్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: