మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థ 2021-22 విద్యా సంవత్సరానికి గాను బాలబాలికలకు ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేది జూన్ 15వ తేదీ వరకు పొడిగించడమైనది. దరఖాస్తులను ఆన్లైన్ లో www.miptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాత్మ జ్యోతిబాపూలే మణుగూరు బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి.నవీన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఆసక్తి గల విద్యార్థులు మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ 40 సీట్లు,బైపీసీ 20 సీట్లు,సీఈసీ 20 సీట్లు,కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.బీసీ, ఎస్సీ,ఎస్టీ,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపిక విధానం రాత పరీక్ష దరఖాస్తు రుసుము 200 అని తెలిపారు
Post A Comment: