మన్యం టీవీ కొత్తగూడెం
శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లలతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు నిర్మాణాలు, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్, నూతన మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు భూముల బదలాయింపు, ధరణి దరఖాస్తులు పరిస్కారం తదితర అంశాలపై హైదరాబాద్ బిఆర్ కెఆర్ భవన్ నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు 9వ తేదీ వరకు పరిష్కరిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటుకు 100 ఎకరాలు, వైద్య, నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి కావాల్సిన భూమి కేటాయింపులు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎస్ యొక్క సోమేశ్ కుమార్ మాట్లాడుతూ 12 జిల్లాలో కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు తక్షణమే పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మిగతా జిల్లాలో కలెక్టరేటే భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణంకోసం TSIIC కి భూములు అప్పగించే విదంగా చర్యలు ప్రారంభించాలన్నాలని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల ఏడు జిల్లాలలో నూతన వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేసిందని నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం గుర్తించిన భూమి కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు.
ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లు, భూవిషయాలకు సంబంధించిన ఫిర్యాదులు మాడ్యూల్స్, ప్రొహిబిటరి ప్రాపర్టీలలో సమర్పించిన ధరఖాస్తుల పరిష్కార పురోగతిని సమీక్షించి, జూన్ 9 లోగా పరిష్కరించి తద్వారా రైతులకు రైతుబంధు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ ట్రిబ్యునల్ లో పెండింగ్ కేసులకు సంబంధించి హియరింగ్ లను నిర్వహించాలన్నారు.
ఈ వీడియోకాన్ఫరెన్స్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ర.భ. ఈ భీంల, ఏవో గన్యా, టీఎస్ఐడిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: