CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాయిబాబా ఆలయానికి 80 వేల రూపాయలు విరాళాలు

Share it:

 


మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:

 జూనియర్ కళాశాల సెంటర్ లో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం బాబా వారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు అలంకరించి స్వర్ణ ఆభరణాలు ధరింపజేశారు. హారతి పాడారు.


 శ్రీ సాయి బాబా వారి ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి, స్వర్ణ రుద్రాక్షమాల కు పలువురు భక్తులు విరాళాలు అందించారని అధ్యక్షులు కురిచేటి శ్రీనివాసరావు తెలిపారు.


 కొంజర్ల నగేష్ కల్పన దంపతులు, గార్లపాటి దేవిశ్రీ రూప శ్రీ, మిట్టపల్లి కిరణ్ కుమార్ స్వాతి లక్ష్మి, జి రమేష్ బాబు హరిత, నిమ్మల శ్రీనివాస్ పద్మావతి, ఆకెళ్ళ రామనాథ శర్మ నిర్మల భక్తుల ద్వారా 80 వేల రూపాయలు విరాళాలు అందాయని అన్నారు.


 విరాళాలు అందించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.అర్చకులు అష్టోత్తర నామార్చన జరిపి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చారుగుళ్ల సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శి కుంచాల రమేష్, సభ్యులు గొర్ల వెంకటేశ్వరరావు మందరపు నాగరాజు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: