మన్యం టివి దుమ్ముగూడెం: మండలంలో దివంగత సీపీఎం నాయకుడు యలమంచి సీతారామయ్య పేరుతో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు,సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్.ట్రస్ట్ కు పృథ్వి ఆర్మీ ఆర్గనైజేషన్ నుండి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ సభ్యులు యలమంచి శ్రీను బాబు,మర్మం చంద్రయ్య, యలమంచి వంశీ కృష్ణ, యానబోయిన వెంకట నరసయ్య, కు పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ నుండి కన్వీనర్ కుమ్మరికుంట సాంబ శివ రావు,బొల్లి పృథ్వి రాజ్ అందచేశారు.ఈ సందర్భంగా యలమంచి సీతారామయ్య ట్రస్ట్ సభ్యలు యలమంచి వంశీ,మాట్లాడుతూ మండల వ్యాప్తంగా కరోనా కాలంలో ట్రస్ట్ సేవలను కొనసాగించేందుకు ఆర్ధిక సహాయం అందించిన పృథ్వి ఆర్మీ ఆర్గనైజేషన్ టీమ్ ను అభినందించారు.పృధ్వి ఆర్మీ హెల్ప్ ఆర్గనైజేషన్ కన్వీనర్ కుమ్మరి కుంట సాంబ శివరావు,పృధ్వి ఆర్మీ ఆర్గనైజేషన్ ఫౌండర్ బొల్లి పృధ్వి రాజ్ మాట్లాడుతూ మా ఆర్గనైజేషన్ ద్వారా విపత్కర పరిస్థితుల్లోనూ రక్త దానం చేశామని అన్నారు.కరోనా కాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం,మాస్కులు శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు.భవిష్యత్ లోనూ పృధ్వి ఆర్మీ ఆర్గనైజేషన్ సేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బూడిద ప్రసాస్,బొల్లి రామకృష్ణ, కుమ్మరికుంట్ల ప్రవీణ్,ప్రభాకర్,ప్రతాప్,లక్ష్మణ్,బాబీ, బొల్లి చాణిక్య,వంశీ,బొల్లి మనోజ్, సుధీర్, బొల్లి శ్రీపతి, వాసు పాల్గొన్నారు
Navigation
Post A Comment: