మర్కోడు పోస్ట్ మాస్టర్ భాస్కర్ రావు కరోనాతో మృతి
గుండాల ( మన్యం టీవీ) కరోనాతో ఇరువురు మృతి చెందిన సంఘటన గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో చోటు చేసుకుంది. గుండాల మండల పరిధిలోని తూరు బాకా గ్రామానికి చెందిన సనప లక్ష్మి 60 కరోనాతో పోరాడుతూ మృతి చెందింది. లక్ష్మి 15 రోజుల క్రితం కరోనా పరీక్ష చేయించుకో గా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అప్పటినుండి ఐదు రోజులు ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంది ఐదు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో ఖమ్మం లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఇప్పటివరకు ఏడున్నర లక్షల వరకు ఖర్చు అయిం ది భరించే సో మమత లేక కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకో వచ్చి అంత్యక్రియలను నిర్వహించారు. ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు పోస్ట్ మాస్టర్ కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. భాస్కర్ రావు చికిత్సకోసం కుటుంబ సభ్యులు 15 లక్షలు పైగా ఖర్చు అయినట్టు సమాచారం
Post A Comment: