మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మేజర్ గ్రామ పంచాయితీలో 4వ విడత పల్లె ప్రగతి లో భాగంగా ఈరోజు పాదయాత్ర ప్రారంభించిన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య. సర్పంచ్ అట్టం రమ్య ఆధ్వర్యంలో పలు వార్డులలో సమస్యలు గుర్తించటం జరిగింది. ఈసమస్యలు పరిష్కారానికి తగు చర్యలు చేపట్టారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఆర్డిఓ స్వర్ణలత, ఎంపీపీ శ్రీరాంమూర్తి, ఎంపిఓ సీతారామరాజు, మండల రైతు కన్వీనర్ రమేష్, ఐసీడీఎస్ విజయలక్ష్మీ, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: