మన్యం టీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ సాధు జోత్స్న బాయి, పాలకవర్గం ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బుదవారం గ్రామ పంచాయతీ లో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర లో గ్రామంలో సమస్యలు గుర్తించి పల్లె ప్రగతి లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్పెసల్ ఆఫిసర్ సీడీపీఓ రోజారాణి, ఎంపీటీసీ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, ఉపసర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: