మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలం లో కోవిడ్ -19 ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతుంది. మండల పరిధిలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మరో 45 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయని వైద్య అధికారులు తెలిపారు. గుమ్మడవెల్లి పీహెచ్సీలో 110 టెస్టుల గాను ఐదుగురికి, వినాయకపురం పీహెచ్సీలో 115 టెస్టులు నిర్వహించగా 15 మందికి, అశ్వరావుపేట లో 135 మందికి టెస్టులు నిర్వహించగా 25 మందికి పాజిటివ్ కేసులు నమోదు కాబడ్డాయి అని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు శానిటైసర్ లు ఉపయోగించాలని వారు తెలిపారు.
Post A Comment: