మన్యం టీవీ పాల్వంచ :-
ఈ రోజు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నకిలీ విత్తనాల విక్రయం, రాబోయే వర్షాకాలంలో వేయబోయే పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ సమీక్ష సమావేశం లోని ముఖ్యాంశాలు.
👉 నకిలీ విత్తనాల పై నిఘా పెట్టండి.
👉 లైసెన్స్ లేని వ్యాపారులు విత్తనాలు అమ్మితే పీ.డీ ఆక్ట్ నమోదు చేయాలి.
👉 నకిలీ విత్తనాల మోసగాళ్లు పై అవసరమైతే టడా కేసులు పెట్టండి.
👉 వ్యవసాయ సీజన్ లో ఎరువుల వ్యాపారుల పై టాస్క్ఫోర్స్ బృందాలు నిఘా పెట్టాలి.
👉 రైతు వేదిక లోనే రైతులకు కు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.
👉 పంటల కొనుగోలు లో మోసాలు జరిగితే సహించేది లేదు.
👉 లైసెన్సు ఉన్న ఎరువులు విత్తనాలు అధిక ధరలకు విక్రయించి వద్దు.
👉 వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేయాలి.
👉 రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
👉 తూకాల్లో మోసాలు చేస్తే సహించేది లేదు, వారిపై క్రిమినల్ కేసులు పెడతా.
👉 రైతులను చైతన్యం కలిగించండి.
👉 రైతులకు అన్యాయం జరిగితే అధికారులదే బాధ్యత.
👉 రైతులు ధాన్యం తడిసి పోకుండా చర్యలు చేపట్టండి.
ఈ యొక్క సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కురుస అభిమన్యుడు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న,ఏ.డి.ఏ లు కరుణశ్రీ, లాలు చంద్,ఏ.ఓ రాజేశ్వరి, శంకర్, గోపాల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: