భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అభ్యర్థులకు శనివారం రెండవ విడత ఉచిత మెటీరియల్ పంపిణీ చేయబడునని క్యాంపు కార్యాలయం సిబ్బంది శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు మణుగూరు క్యాంపు కార్యాలయంలో విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా ఈ మెటీరియల్ అందజేయడం జరుగుతుందన్నారు.నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Post A Comment: