హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2.17 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. శంషాబాద్ ఎస్వోటీ, బాలానగర్ పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా రైడ్ చేసి నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. మేడ్చల్కు చెందిన షేక్ కాలేష్ వలీ ప్రధాన నిందితుడు. కర్నూల్కు చెందిన కన్నాల మహేష్తో కలిసి నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు సైబరాబాద్లో 12 కేసులు నమోదు
చేసినట్లు తెలిపిన సీపీ సజ్జనార్ 6 టన్నుల నకిలీ విత్తనాలను సీజ్ చేసినట్లు తెలిపారు
Post A Comment: