మన్యం టీవీ, భద్రాచలం టౌన్:
భద్రాచలంలో బండారు చందర్రావు ట్రస్టు నిర్వహిస్తున్న
ఉచిత కరోనా ఐసోలేషన్ కేంద్రంగురించి తెలుసుకుని
ఈరోజు ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన ఆశ్వాపురం
హెవివాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ నాయకులు నాగభూషణం ఐసోలేషన్ కేంద్రంనిర్వహాణకు తనవంతు సహాయంగా వారి మామగారు ఎడ్లపల్లి శేషగిరిగారివజ్ఞాపకార్ధం 25000/- రూపాయలను బండారు చందర్రావుట్రస్టు నిర్వహకులు సిపియం రాష్ట్ర కవిుటి సభ్యులు ఎజే రమేష్ చెక్ రూపంలో అందజేశారు. ఈసందర్భంగా నాగభూషణంగారు మాట్లాడుతూ ప్రజా పోరాలతోపాటు ప్రజలకు విపత్తుకాలంలో సేవచేయటంలో సిపియం ఎళ్ళవేళలా ముందు వుంటుందని తెలిపారు.నిస్వార్ధంగా సేవచేయటం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించటంలో బండారుచందర్రావు ట్రస్టు చేస్తున్న కృషికి వెలకట్టలేమని అన్నారు.ఇంతపెద్ద సేవా కార్యక్రమంలో
తమ కుటుంబంమెుక్కసహయం వుండటం మాకు చాల ఆనందంగా వుందనిఅన్నారు. భద్రాచలం
పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ,ఐలు నాయకులు యంవి ప్రసాదరావు,ఝన్సీ దంపతుల కుమారుడు హర్హ పుట్టినరోజు సందర్భంగా ఐసోలేషన్ కేంద్రానికి 15 లీటర్ల టీ ప్లాస్కో,హట్ బాక్స్,రేటిమేకర్ మెుత్తం 6000/- విలువైన వస్తువులను సిపియం రాష్ట్ర కవిుటిసభ్యులు మచ్చావెంకటేశ్వర్లు చేతులవీుదుగా ఐసోలేషన్ కేంద్రానికి అందజేశారు. ఈకార్యక్రమంలో బీసీఆర్ ట్రస్టు నిర్వహకులు గడ్డం స్వావిు,సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు గద్దల శ్రీను,ట్రస్టు సభ్యులు, MBనర్సారెడ్డి ,బ్రహ్మాచారి రేణుక బండారు శరత్ బాబు, వెంకటరెడ్డి లీలావతి,గంగా,లక్ష్మి,నాగరాజు,ఫిరోజ్ ,జ్యోతి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: