మన్యం టీవీ,బూర్గంపాడు:
అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే 108 వాహనం నిలపడానికి స్థలం కరవైందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండలం లో ఎప్పటి నుంచో 108 వాహనం లేదు. ప్రజల విజ్ఞప్తు లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరవతో 3 నెలల క్రితం మండలానికి 108 వాహనం మంజూరైనట్లు సమాచారం. కానీ అప్పటి నుంచి భద్రాచలం నుంచే తన సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. బూర్గంపాడు మండల కేంద్రంలో వాహనం నిలపడానికి అధికారులు అనువైన స్థలం చూపించక పోవడంతో భద్రాచలంలోనే ఉంచుతున్నామని 108 సిబ్బంది అంటున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలతో పాటు పాయిజన్, డెలివరీ కేసులు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే భద్రాచలం నుంచి వాహనం రావాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి బూర్గంపాడు మండల కేంద్రంలో 108 వాహనం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో సత్వర వైద్య సేవలు అందే వీలుందని అంటున్నారు.
Post A Comment: